ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపిన TSRTC

- December 05, 2022 , by Maagulf
ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపిన TSRTC

హైదరాబాద్: ప్రయాణికులకు TSRTC తాజాగా మరో తీపి కబురును అందించింది.బస్సు బయలుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకరాబోతున్నట్లు తెలిపింది. మాములుగా అయితే బస్సు స్టార్ట్ కాకముందు వరకు మాత్రమే ప్రయాణికులు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వబోతుంది.

బస్సు బయలుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొస్తోంది.ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులలో ఐ టిమ్స్ అనే ఈ నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులలో ప్రవేశపెట్టాలని తాజాగా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.అన్ని సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సర్వీసులలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com