ప్రపంచ గ్రోత్ ఇంజిన్‌గా ఇండియా.. IBPC ప్యానెల్ లో వక్తలు

- December 06, 2022 , by Maagulf
ప్రపంచ గ్రోత్ ఇంజిన్‌గా ఇండియా.. IBPC ప్యానెల్ లో వక్తలు

కువైట్: ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్(IBPC) కువైట్ కువైట్‌లోని జుమేరా బీచ్ హోటల్‌లో "భారతదేశం - ప్రపంచంలోని తదుపరి వృద్ధి ఇంజిన్" అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. కువైట్‌కు చెందిన ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఛైర్మన్ డారీ అలీ అల్-రషీద్ అల్ బాడర్, ముంబైకి చెందిన ఏక్విటాస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ భయ్యా, ఐబీపీసీ ఛైర్మన్ గుర్విందర్ సింగ్ లాంబా ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు.

భారత రాయబార కార్యాలయం–రాజకీయ, వాణిజ్యం - ప్రథమ కార్యదర్శి స్మితా పాటిల్ ప్యానల్ చర్చను ప్రారంభిస్తూ.. గత కొన్ని దశాబ్దాలుగా, భారతదేశం నెమ్మదిగా, స్థిరంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ప్రపంచం భారతదేశం వైపు చూసే సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే దశాబ్దంలో  మొత్తం ప్రపంచ వృద్ధిలో ఐదవ వంతును భారత్ నడుపుతుందని ఆమె చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచ గ్రోత్ ఇంజిన్ గా భారత్ మారుతుందని స్మితా పాటిల్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com