తెలంగాణలో భూకంపం..
- December 06, 2022
తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళారం తెల్లవారుజామున 3.20 గంటలకు కోహీర్ మండలం బిలాల్ పూర్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ పేర్కొంది.
నల్గొండకు 117 కిలో మీటర్ల దూరంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకముందు గతేడాది జనవరిలోనూ కోహీర్ మండలంలో పల్లు చోట్ల భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









