హయ్యా కార్డ్ లేకుండానే ఖతార్లోకి.. జీసీసీ పౌరులు, నివాసితులకు అనుమతి
- December 07, 2022
దోహా: జీసీసీ పౌరులు, నివాసితులు హయ్యా కార్డు కోసం నమోదు చేసుకోవలసిన అవసరం లేకుండా ఖతార్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే జీసీసీ దేశాల పౌరులు, నివాసితులు హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఖతార్లోకి ప్రవేశించవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సందర్శకుల కోసం ఉచిత ధరల పార్కింగ్ స్థలాలను కేటాయించామని, బస్సుల ద్వారా రవాణా మునుపటి రోజుల మాదిరిగానే పోర్టుల ద్వారా ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. జీససీ దేశాల పౌరులు, నివాసితులు తమ వాహనాల ద్వారా ల్యాండ్ పోర్ట్ల ద్వారా వచ్చేవారు డిసెంబర్ 8 గురువారం నుండి ఖతార్లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అయితే, ప్రయాణ తేదీ నుండి 12 గంటల కంటే తక్కువ వ్యవధితో ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్గా అనుమతి కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటందని తెలిపింది. ప్రపంచ కప్ మ్యాచ్లతో పాటు జరిగే కార్యక్రమాల వాతావరణాన్ని ఆస్వాదించడానికి జీసీసీ దేశాల సందర్శకులు, పౌరులు, నివాసితులకు అవకాశం కల్పించడానికి చేసిన ప్రయత్నాలతో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా వరల్డ్ కప్ మ్యాచ్లకు హాజరు కావాలనుకునే అభిమానులు మాత్రం హయ్యా ఈ-ప్లాట్ఫాం ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొంది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!









