తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు: ఒమన్
- December 07, 2022
మస్కట్: తమ ఉత్పత్తులు వినియోగదారుల దృష్టిని ఆకర్షించాలని కంపెనీలు ప్రకటనల కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటాయి. కొంతమంది ప్రకటనలు చెప్పేవి అతిశయోక్తిగా ఉంటాయి. తప్పుదారి పట్టించే విధంగా ఆ ప్రకటనలు ఉంటాయి. ఇలా వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా ఉండే ప్రకటనలపై చర్యలు తీసుకుంటామని వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA)లోని కమర్షియల్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అల్ ఫదేల్ బిన్ నసీర్ అల్ యహ్మదీ హెచ్చరించారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న లేదా కేవలం తప్పుడు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తప్పుదారి పట్టించే ప్రకటనలు వినియోగదారులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్య ఉత్పత్తుల కోసం ప్రకటనల విషయంలో ఇలా తప్పుడు ప్రకటనలు ఎక్కువ నష్టం చేస్తాయన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలను ఎదుర్కోవడానికి, వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) ఇతర సంబంధిత విభాగాలతో సన్నిహిత సహకారంతో పని చేస్తోందని అల్ యహ్మదీ చెప్పారు. 2022 సంవత్సరంలో తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన దాదాపు 600 క్లెయిమ్స్, ఫిర్యాదులు అందాయని, 2021లో 610 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







