మాజీ ఎంపీని మోసం చేసిన ప్రవాసులపై విచారణ ప్రారంభం
- December 07, 2022
బహ్రెయిన్: ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులమని చెప్పిన నిందితులు బహ్రెయిన్ ఒక మాజీ ఎంపీ నుండి బిడి2,000 లు కాజేశారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రవాసులపై కేసును బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు విచారించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితుడికి ఫోన్ చేసి, అతని బ్యాంక్ ఖాతా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉందని అతన్ని భయపెట్టారు. వారి మాటలు నమ్మిన ఎంపీ తన ఫోన్ కు వచ్చిన ఓటీపీని నిందుతులతో పంచుకున్నాడు. అంతే తన బ్యాంక్ ఖాతా నుండి మరొక ఖాతాకు BD1,800 మొత్తం బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. విచారణ అనంతరం ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసి వారిపై మోసానికి సంబంధించిన కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









