మాజీ ఎంపీని మోసం చేసిన ప్రవాసులపై విచారణ ప్రారంభం

- December 07, 2022 , by Maagulf
మాజీ ఎంపీని మోసం చేసిన ప్రవాసులపై విచారణ ప్రారంభం

బహ్రెయిన్: ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులమని చెప్పిన నిందితులు బహ్రెయిన్ ఒక మాజీ ఎంపీ నుండి బిడి2,000 లు కాజేశారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రవాసులపై కేసును బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు విచారించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితుడికి ఫోన్ చేసి, అతని బ్యాంక్ ఖాతా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉందని అతన్ని భయపెట్టారు. వారి మాటలు నమ్మిన ఎంపీ తన ఫోన్ కు వచ్చిన ఓటీపీని నిందుతులతో పంచుకున్నాడు. అంతే తన బ్యాంక్ ఖాతా నుండి మరొక ఖాతాకు BD1,800 మొత్తం బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్‌ కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. విచారణ అనంతరం ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసి వారిపై మోసానికి సంబంధించిన కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com