మాజీ ఎంపీని మోసం చేసిన ప్రవాసులపై విచారణ ప్రారంభం
- December 07, 2022
బహ్రెయిన్: ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులమని చెప్పిన నిందితులు బహ్రెయిన్ ఒక మాజీ ఎంపీ నుండి బిడి2,000 లు కాజేశారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రవాసులపై కేసును బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు విచారించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితుడికి ఫోన్ చేసి, అతని బ్యాంక్ ఖాతా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉందని అతన్ని భయపెట్టారు. వారి మాటలు నమ్మిన ఎంపీ తన ఫోన్ కు వచ్చిన ఓటీపీని నిందుతులతో పంచుకున్నాడు. అంతే తన బ్యాంక్ ఖాతా నుండి మరొక ఖాతాకు BD1,800 మొత్తం బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. విచారణ అనంతరం ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసి వారిపై మోసానికి సంబంధించిన కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







