దుబాయ్ లో 132 వాహనాలు స్వాధీనం.. జరిమానా
- December 08, 2022
దుబాయ్: యూఏఈ 51వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దుబాయ్ పోలీసులు 132 వాహనాలను స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ కు అంతరాయం, వాహనాల రంగును మార్చడం, పర్మిట్ లేకుండా వారి వాహనాలను స్టిక్కర్లతో కప్పి ఉంచడం, కార్ల నుండి చెత్తను వేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, తమకు..ఇతరులకు ప్రమాదం కలిగించే ఉల్లంఘనలు ఉన్నాయని, అలాగే వాహనదారులపై బ్లాక్ పాయింట్లు కూడా విధించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బర్ దుబాయ్లో పెట్రోలింగ్ సిబ్బంది 4,697 మంది వాహనదారులకు జరిమానాలు విధించారని, అలాగే 72 వాహనాలను డీరాలో స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







