దుబాయ్ లో 132 వాహనాలు స్వాధీనం.. జరిమానా

- December 08, 2022 , by Maagulf
దుబాయ్ లో 132 వాహనాలు స్వాధీనం.. జరిమానా

దుబాయ్: యూఏఈ 51వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దుబాయ్ పోలీసులు 132 వాహనాలను స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ కు అంతరాయం, వాహనాల రంగును మార్చడం, పర్మిట్ లేకుండా వారి వాహనాలను స్టిక్కర్లతో కప్పి ఉంచడం, కార్ల నుండి చెత్తను వేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, తమకు..ఇతరులకు ప్రమాదం కలిగించే ఉల్లంఘనలు ఉన్నాయని, అలాగే వాహనదారులపై బ్లాక్ పాయింట్లు కూడా విధించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బర్ దుబాయ్‌లో పెట్రోలింగ్‌ సిబ్బంది 4,697 మంది వాహనదారులకు జరిమానాలు విధించారని, అలాగే 72 వాహనాలను డీరాలో స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్‌లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com