సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన కింగ్ సల్మాన్, చైనా అధ్యక్షుడు
- December 09, 2022
రియాద్: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్.. రియాద్లోని అల్-యమామా ప్యాలెస్లో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో విస్తృత చర్చలు జరిపారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో వారి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సౌదీ అరేబియా, చైనా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై రాజు సల్మాన్, అధ్యక్షుడు జి జిన్పింగ్ సంతకం చేశారు. అంతకుముందు సౌదీ అరేబియాకు విచ్చేసిన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ప్రతినిధి బృందానికి కింగ్ సల్మాన్ స్వాగతం పలికారు. సౌదీ అరేబియా, చైనా మధ్య చారిత్రక స్నేహం, వివిధ రంగాలలో స్నేహపూర్వక ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయే మార్గాలపై ఇరుదేశాధినేతలు సమీక్షించారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జి జిన్పింగ్ బుధవారం రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన చైనా- సౌదీ సదస్సుతో పాటు రెండు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు. గత ఆరేళ్లలో సౌదీ అరేబియాలో ప్రెసిడెంట్ జి జిన్పింగ్ రెండో పర్యటన ఇది. రాజుతో చైనా అధినేత మొదటి సమావేశం 2016లో రియాద్లో జరిగింది. దీని తర్వాత 2017 మార్చిలో కింగ్ సల్మాన్ చైనాలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సౌదీ రాష్ట్ర మంత్రి, కేబినెట్ సభ్యుడు, జాతీయ భద్రతా సలహాదారు డా. ముసేద్ అల్-ఐబాన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, CPC జనరల్ ఆఫీస్ డైరెక్టర్ డింగ్ జూజీయాంగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







