సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన కింగ్ సల్మాన్, చైనా అధ్యక్షుడు
- December 09, 2022
రియాద్: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్.. రియాద్లోని అల్-యమామా ప్యాలెస్లో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో విస్తృత చర్చలు జరిపారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో వారి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సౌదీ అరేబియా, చైనా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై రాజు సల్మాన్, అధ్యక్షుడు జి జిన్పింగ్ సంతకం చేశారు. అంతకుముందు సౌదీ అరేబియాకు విచ్చేసిన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ప్రతినిధి బృందానికి కింగ్ సల్మాన్ స్వాగతం పలికారు. సౌదీ అరేబియా, చైనా మధ్య చారిత్రక స్నేహం, వివిధ రంగాలలో స్నేహపూర్వక ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయే మార్గాలపై ఇరుదేశాధినేతలు సమీక్షించారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జి జిన్పింగ్ బుధవారం రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన చైనా- సౌదీ సదస్సుతో పాటు రెండు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు. గత ఆరేళ్లలో సౌదీ అరేబియాలో ప్రెసిడెంట్ జి జిన్పింగ్ రెండో పర్యటన ఇది. రాజుతో చైనా అధినేత మొదటి సమావేశం 2016లో రియాద్లో జరిగింది. దీని తర్వాత 2017 మార్చిలో కింగ్ సల్మాన్ చైనాలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సౌదీ రాష్ట్ర మంత్రి, కేబినెట్ సభ్యుడు, జాతీయ భద్రతా సలహాదారు డా. ముసేద్ అల్-ఐబాన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, CPC జనరల్ ఆఫీస్ డైరెక్టర్ డింగ్ జూజీయాంగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







