డిసెంబరు 14-15 తేదీల్లో యూఏఈలో భారీ ఉల్కాపాతం!
- December 09, 2022
యూఏఈ: ఈ ఏడాది చివరి ఉల్కాపాతం డిసెంబరు 14-15 రాత్రికి గరిష్ట స్థాయికి చేరుకోనున్నది. అత్యంత అద్భుతమైన ఉల్కాపాతాలతో ఆకాశం అబ్బురపరుస్తుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకటించింది. నివాసితులు సంవత్సరంలో అతిపెద్ద , చివరి ఉల్కాపాతం(జెమినిడ్స్ ఉల్కాపాతం) వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
జెమినిడ్స్ ఉల్కాపాతం అంటే ఏమిటి?
జెమినిడ్స్ ఉల్కాపాతంలో శిధిలాల ముక్కలు సెకనుకు 70 కిమీ వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. భూ వాతావరణంలోకి అవి ప్రవేశిస్తూనే అవి మండిపోతాయి. వాటినే ఉల్కలు అని పిలుస్తారు. అద్భుతమైన ఉల్కాపాతంలో గరిష్టంగా గంటకు 150 ఉల్కలను చూడవచ్చు. వాటిలో కొన్ని మాత్రమే అరుదుగా భూమిని చేరే అవకాశం ఉంటుంది.
ఎలా చూడాలి?
ఉల్కాపాతాన్ని వీక్షించేందుకు ప్రజలకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేదా నైపుణ్యాలు అవసరం లేదని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. కావలసిందల్లా స్వచ్ఛమైన ఆకాశం, సిటీ లైట్లకు దూరంగా ఉండే ప్రదేశం.
ఎక్కడ చూడొచ్చంటే?
దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ డిసెంబర్ 14న దుబాయ్లోని అల్ ఖుద్రాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు జరుగుతుంది. అదేసమయంలో టెలిస్కోప్ ద్వారా చంద్రుడు, మార్స్, బృహస్పతి, శని గ్రహాలలను చూసే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







