చెన్నైలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిఎం స్టాలిన్!
- December 10, 2022
చెన్నై: మాండూస్ తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. దీంతో తినేకి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు.
నిరాశ్రయులకు బియ్యం, పప్పు, బ్రెడ్డు తదితర నిత్యావసర సరకులను అందజేశారు. అదేవిధంగా వరద పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… చెన్నైలో 115 మి.మీటర్ల వర్షంపాతం నమోదైనట్లు చెప్పారు. తుపాను తీరం దాటిన సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు నగరంలో దాదాపు 400 చెట్లు పడిపోయినట్లు సీఎం తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







