చెన్నైలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిఎం స్టాలిన్!
- December 10, 2022
చెన్నై: మాండూస్ తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. దీంతో తినేకి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు.
నిరాశ్రయులకు బియ్యం, పప్పు, బ్రెడ్డు తదితర నిత్యావసర సరకులను అందజేశారు. అదేవిధంగా వరద పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… చెన్నైలో 115 మి.మీటర్ల వర్షంపాతం నమోదైనట్లు చెప్పారు. తుపాను తీరం దాటిన సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు నగరంలో దాదాపు 400 చెట్లు పడిపోయినట్లు సీఎం తెలిపారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







