హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ
- December 10, 2022
సిమ్లా: హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్లో 35 సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. అయితే సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. పలువురు నేతలు సీఎం పదవికి కోసం ప్రయత్నాలు చేశారు.
మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి, పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం పదవి కోసం గట్టిగా ట్రై చేసారు. ఆమెనే సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సుఖ్విందర్ సింగ్ సుఖూను ఖరారు చేసారు. రేపే (ఆదివారం) సీఎంగా సుఖ్విందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన రాష్ట్రంలోని నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఇక డిప్యూటీ సీఎం పదవికి ముకేశ్ అగ్నిహోత్రిని ఎంపిక చేశారు. ఈయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. ముకేశ్ అగ్నిహోత్రి హరోలీ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









