హిమాచల్​ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ

- December 10, 2022 , by Maagulf
హిమాచల్​ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ

సిమ్లా: హిమాచల్​ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్​ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో 35 సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా కాంగ్రెస్‌ 40 సీట్లలో గెలుపొందింది. అయితే సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. పలువురు నేతలు సీఎం పదవికి కోసం ప్రయత్నాలు చేశారు.

మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ సతీమణి, పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ సీఎం పదవి కోసం గట్టిగా ట్రై చేసారు. ఆమెనే సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్​ అధిష్ఠానం మాత్రం సుఖ్విందర్ సింగ్ సుఖూను ఖరారు చేసారు. రేపే (ఆదివారం) సీఎంగా సుఖ్విందర్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన రాష్ట్రంలోని నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఇక డిప్యూటీ సీఎం పదవికి ముకేశ్ అగ్నిహోత్రిని ఎంపిక చేశారు. ఈయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. ముకేశ్ అగ్నిహోత్రి హరోలీ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com