ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు తీవ్ర అస్వస్థత
- December 11, 2022
చెన్నై: డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆసుపత్రికి చేరకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
దీంతో తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. అయితే శరత్ కుమార్ కు డిసెంబర్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆయన భార్య ప్రముఖ నటి రాధిక ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని..అయినా కాని మంచి వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు.
ఇదే విషయాన్నిఆయన కుమార్తె వరలక్ష్మీ కూడా ప్రకటించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. అయితే ఇవాళ మళ్లీ శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆసుపత్రి వారు విడుదల చేసే హెల్త్ బులెటిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







