షాపులలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- December 15, 2022
యూఏఈ: ఎమిరేట్లోని షాపుల్లోకి చొరబడి ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకున్న ఐదుగురు ఆసియన్లతో కూడిన ముఠాను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సీఐడీ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ బిన్ నాసర్ తెలిపారు. వారి నివాసం నుంచి చోరీకి గురైన వస్తువులు మొబైల్ ఫోన్లు, డబ్బు, వాచీలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. అధిక నాణ్యత గల సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, దుకాణంలో పెద్ద మొత్తంలో డబ్బును ఉంచకుండా.. విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశాలలో ఉంచడం ద్వారా తమ దుకాణాల్లో చోరీ నివారణ చర్యలను మెరుగుపరుచుకోవాలని వ్యాపార యజమానులను ఆయన కోరారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







