షాపులలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- December 15, 2022
యూఏఈ: ఎమిరేట్లోని షాపుల్లోకి చొరబడి ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకున్న ఐదుగురు ఆసియన్లతో కూడిన ముఠాను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సీఐడీ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ బిన్ నాసర్ తెలిపారు. వారి నివాసం నుంచి చోరీకి గురైన వస్తువులు మొబైల్ ఫోన్లు, డబ్బు, వాచీలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. అధిక నాణ్యత గల సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, దుకాణంలో పెద్ద మొత్తంలో డబ్బును ఉంచకుండా.. విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశాలలో ఉంచడం ద్వారా తమ దుకాణాల్లో చోరీ నివారణ చర్యలను మెరుగుపరుచుకోవాలని వ్యాపార యజమానులను ఆయన కోరారు.
తాజా వార్తలు
- భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!









