చైనాతో రగడ నేపథ్యంలో అగ్ని-5 పరీక్షించిన భారత్
- December 15, 2022
న్యూ ఢిల్లీ: చైనాతో సరిహద్దు రగడ నేపథ్యంలో భారత్ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ అగ్ని-5 క్షిపణిని గురువారం పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి చేసిన ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే అగ్ని-5 పరీక్షే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణుల్లో అగ్ని-5 ఒకటి. ఈ క్షిపణికి 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం కొట్టగల సామర్థ్యం ఉంది. ఈ దూరంతో చైనా భూభాగం మొత్తం అగ్ని-5 పరిధిలోకి వస్తుంది. ఈ క్షిపణిని కనుక ప్రయోగించినట్లైతే చైనాలోని ఏ భాగాన్నైనా లక్ష్యంగా చేసుకోవచ్చు.
వాస్తవానికి ఈ క్షిపణి పాతదే. 2012 సంవత్సరంలోనే మొదటిసారి పరీక్షించారు. అప్పుడే ఇది విజయవంతం అయింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుతం చైనాతో తగాదా నేపథ్యంలో మరోసారి పరీక్షించారు. సూదుర లక్ష్యాలను చేధించే క్షిపణిని పరీక్షించాలనే ఉద్దేశాన్ని భారత్ కొద్ది వారాల క్రితమే ప్రకటించింది. దాని కోసం నోటం లేదా ఎయిర్మెన్లకు నోటీసు జారీ చేసి, ప్రణాళికాబద్ధమైన టెస్ట్-ఫైరింగ్ గురించి హెచ్చరించింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో అగ్ని-5ని భారత వ్యూహాత్మక దళ కమాండ్లో చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







