దిల్ రాజు కెలుకుడు.! తగ్గేదేలే.!
- December 17, 2022
పబ్లిసిటీ కోసం దిల్ రాజు ఎంత దూరమైనా వెళతారనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆయన సినిమా ‘వారసుడు’ కోసం తెలుగు రాష్ర్టాల్లో కీలకమైన ధియేటర్లు లాక్ చేసి, తెలుగు సినీ నిర్మాతల మండలి గుస్సాకి కారణమయ్యారు దిల్ రాజు.
ఇక్కడి పరిస్థితి ఇలా వుంటే, తమిళ నాట కూడా కెలుకుడు మొదలెట్టేశారు రాజుగారు. అక్కడ కూడా ధియేటర్ల విషయంలో చిచ్చు పెట్టారు. అదే రోజు రిలీజ్ అవుతున్న అజిత్ సినిమా కన్నా, తాను రూపొందిస్తున్న విజయ్ సినిమాకే అజిత్ కన్నా 50 ధియేటర్లు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దాంతో, తమ హీరోని తక్కువ చేస్తారా.? అంటూ అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా తన మాటల్ని వక్రీకరించారనీ, తాను అలా అనలేదనీ మీడియాని కెలికారు. ఇలా ఒకదావి మీద ఒకటి అన్నట్లుగా రాజుగారి కెలుకుడు ఆగేదే లే.! అన్నట్లుగా ఇన్ష్టాల్మెంట్లలో నడుస్తోంది.
సినిమా రిలీజ్ అయ్యే వరకూ రాజుగారి ఈ కెలుకుడు తగ్తేదే లే.! ఏమో చూడాలిక.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..







