రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించండి: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
- December 21, 2022
న్యూఢిల్లీ: చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. మీటింగ్ అనంతరం మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని, అందరూ అలర్ట్గా ఉండాలని, నిఘా పెంచాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది.చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంత్రి మాండవీయ మీటింగ్లో పాల్గొన్న అధికారులు అందరూ మాస్క్లు ధరించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







