ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- October 28, 2025
గుంటూరులో నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా అద్భుతమైన చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.2026, జనవరి 3,4,5 తేదీల్లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని వివరించారు.అందులో భాగంగా స్థానిక శ్రీ సత్యసాయి స్పిర్చివల్ సిటీ ప్రాంగణంలో ‘మన అమరావతి’ పేరుతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రదర్శనలో తెలుగు సంస్కృతి, తెలుగు భాషా వైభవం, ఆంధ్రప్రదేశ్ కీర్తి, పర్యావరణంతోపాటు ప్రకృతి సౌందర్యం తదితర అంశాలను ప్రతిబింబించే "చిత్రకళా కృతులను" ప్రదర్శించేందుకు వర్ధమాన, ప్రముఖ చిత్రకారులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రదర్శనలో ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ కళాకారునికి ప్రశంసా పత్రంతోపాటు ఈ మహాసభల అభినందన పతకం అందిస్తామని వివరించారు. చిత్రకారులు తమ చిత్రాలను కింద చిరునామాకు 2025, డిసెంబర్ 15వ తేదీ లోపు పంపాల్సి ఉంటుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కింది చిరునామాకు పంపాలని సూచించారు.
చిరునామా:
ఎస్.విజయ్ కుమార్,
సమన్వయకర్త–చిత్ర కళా ప్రదర్శన “మన అమరావతి”
202, సత్యవతి హోమ్స్,
కనకమేడల కన్వెన్షన్ ఎదురుగా,
మెయిన్ రోడ్, ఎస్విఎన్ కాలనీ,గుంటూరు 522006
సెల్ నెంబర్ : 9849503860.
నిబంధనలు..
గీసిన చిత్రాలు పరిమాణం: గరిష్ఠం 24” x 30” ఉండాలని,ఏదైనా ఫ్రేమ్ చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలనీ కోరారు. ఇక ఈ ప్రదర్శనలోని ఆయా చిత్రాలు విక్రయం జరిగితే.. వచ్చిన నగదు మొత్తాన్ని నేరుగా ఆయా కళాకారులకు అందజేయ బడుతుందని స్పష్టం చేశారు.
తెలుగు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించే ఈ మహత్తర కళా ప్రదర్శనలో మీ విలువైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని కార్యదర్శి శ్రీ ధవేజి , ముఖ్య సమన్వయకర్త శ్రీ పి.రామచంద్ర రాజు, సహ సమన్వయకర్త వి.విద్యాసాగర్ తెలిపారు.
మరిన్ని వివరాలు కోసం..
డా.గజల్ శ్రీనివాస్
అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్
సెల్ నెంబర్: 9849013697
పి.రామచంద్ర రాజు
ముఖ్య సమన్వయ కర్త
3వ ప్రపంచ తెలుగు మహాసభలు- 2026
తాజా వార్తలు
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!







