హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- October 28, 2025
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణ రావు (కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త)తో తన అనుబంధాన్ని సర్మించుకున్నారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, ఓదార్చారు.
భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. హరీశ్ రావును హత్తుకొని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అదేవిధంగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని.. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









