హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- October 28, 2025
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణ రావు (కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త)తో తన అనుబంధాన్ని సర్మించుకున్నారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, ఓదార్చారు.
భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. హరీశ్ రావును హత్తుకొని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అదేవిధంగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని.. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







