హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- October 28, 2025
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సత్యనారాయణ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. తన బావ సత్యనారాయణ రావు (కేసీఆర్ 7వ సోదరి లక్ష్మీ భర్త)తో తన అనుబంధాన్ని సర్మించుకున్నారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, ఓదార్చారు.
భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. హరీశ్ రావును హత్తుకొని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అదేవిధంగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని.. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







