పవన్ కొత్తసినిమా ప్రారంభం
- April 27, 2016
'సర్దార్ గబ్బర్సింగ్' డిజాస్టర్ నుంచి కోలుకున్న పవన్కల్యాణ్ కొత్తసినిమాతో సెట్స్పైకి వెళ్తున్నాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా హైదరాబాద్లో ఓ టెంపుల్ లో ఈ ఉదయం పదిన్నరకు కొత్త చిత్రం సైలెంట్గా ముహూర్తం జరిగిపోయింది.ఈ కార్యక్రమానికి పవన్, డైరెక్టర్ సూర్య, ప్రొడ్యూసర్ శరత్ మరార్ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కావాల్సివుంది.రామజోగయ్యశాస్ర్తి రాసిన రెండుసాంగ్స్ను ఇటీవల ముంబైలోని ఓ స్టూడియోలో రికార్డింగ్ చేశారు. 'ఖుషీ సీక్వెల్'గా ప్రచారం సాగుతున్నప్పటికీ, అదేంకాదని అంటున్నారు పవన్ క్లోజ్ఫ్రెండ్స్. ఈ చిత్రానికి రూబెల్స్ మ్యూజిక్ డైరెక్టర్.శరత్ మరార్ నిర్మాతగా రానున్న ఈ సినిమాని, నార్త్ స్టార్ బ్యానర్ - పవన్ కల్యాణ్ క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 'ఖుషి' వచ్చిన 15 ఏళ్ల తర్వాత ఎస్జె సూర్య - పవన్ కాంబినేషన్ మళ్లీ సెట్స్పైకి వెళ్తోంది. వచ్చేఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. దీనికి సంబందించి డీటేల్స్ త్వరలో వెల్లడికానున్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







