శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ మూడో సినిమా..
- April 27, 2016
వి జయవంతమైన కలయికకు ఉన్న క్రేజే వేరు. హిట్ కాంబినేషన్ అనిపించుకొన్న జోడీ మళ్లీ సినిమా తీస్తోంటే అందరి కళ్లూ అటువైపే ఉంటాయి. 'లక్ష్యం'తో మంచి విజయాన్ని అందుకొని, 'లౌక్యం'తోనూ ఆ పరంపర కొనసాగించారు గోపీచంద్, శ్రీవాస్. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో ప్రయత్నానికి తెర లేపారు. గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. కథ ఇప్పటికే సిద్ధమైంది. 'లక్ష్యం', 'లౌక్యం'లా వినోదం, యాక్షన్ అంశాలకు కథలో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ''మా నుంచి మరో సినిమా వస్తోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. వాటిని అందుకొనే కథ కుదిరింది. గోపీచంద్ని మరో కొత్త కోణంలో చూపించే సినిమా ఇది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా'' అన్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









