రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
- December 25, 2022
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు ద్రౌపది ముర్ము నగరంలోనే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. నిలయంలోపల ఉన్న ఆరు భవనాలను, దీని బయట ఉన్న మరో 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఉద్యానవనాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతంలో రోడ్లను మెరుగుపర్చడంతోపాటు, మంచి నీటి వసతి కల్పించారు. పాములు వంటి హానికర జీవులు రాష్ట్రపతి నిలయం, ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక బృందం ఇక్కడికి వచ్చింది. రాష్ట్రపతి భద్రతసహా ఇతర ఏర్పాట్లను పరిశీలించింది. ప్రత్యేక బలగాలు ఈ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బొల్లారం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో గట్టి భద్రత కొనసాగుతోంది.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







