కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తులకు జైలుశిక్ష, జరిమానా
- December 25, 2022
దుబాయ్: కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసి అతని వాహనాన్ని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్షతోపాటు 760,000 దిర్హామ్ల జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడికి దుబాయ్లో లగ్జరీ కార్ల అమ్మకంలో ప్రత్యేకత కలిగిన కంపెనీ ఉంది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో లగ్జరీ కారు అమ్మకం ప్రకటన చూసి ఓ ఎమిరాటి పేరుతో నిందితులు తనను సంప్రదించినట్లు తెలిపారు. లగ్జరీ కారు ఫోటోలను నిందితులకు పంపిన తర్వాత కోనుగోలు ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కారును ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం కొనుగోలు చేస్తున్నానని నమ్మబలికారు. 761,920 దిర్హాలకు లగ్జరీ కారును కొనుగోలు చేసేందుకు నిందితులు అంగీకరించారని బాధితుడు తెలిపారు. కారు కొనుగోలు మొత్తాన్ని చెల్లించిక ముందే కారు ఓనర్ షిప్ ను తమ పేరుమీద బదిలీ చేయాలని కోరడంతో తాను వారి మాటలను నమ్మి అలాగే చేశానన్నారు. ఆ తర్వాత సదరు కారును మరో ఎమిరేట్లోని షోరూమ్లో కారును అమ్మకానికి ఉంచినట్లు తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసును విచారించిన కోర్టు.. ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 761,920 దిర్హామ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







