కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తులకు జైలుశిక్ష, జరిమానా
- December 25, 2022
దుబాయ్: కార్ల విక్రయ వ్యాపారిని మోసం చేసి అతని వాహనాన్ని దొంగిలించిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్షతోపాటు 760,000 దిర్హామ్ల జరిమానాను కోర్టు విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడికి దుబాయ్లో లగ్జరీ కార్ల అమ్మకంలో ప్రత్యేకత కలిగిన కంపెనీ ఉంది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో లగ్జరీ కారు అమ్మకం ప్రకటన చూసి ఓ ఎమిరాటి పేరుతో నిందితులు తనను సంప్రదించినట్లు తెలిపారు. లగ్జరీ కారు ఫోటోలను నిందితులకు పంపిన తర్వాత కోనుగోలు ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కారును ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం కొనుగోలు చేస్తున్నానని నమ్మబలికారు. 761,920 దిర్హాలకు లగ్జరీ కారును కొనుగోలు చేసేందుకు నిందితులు అంగీకరించారని బాధితుడు తెలిపారు. కారు కొనుగోలు మొత్తాన్ని చెల్లించిక ముందే కారు ఓనర్ షిప్ ను తమ పేరుమీద బదిలీ చేయాలని కోరడంతో తాను వారి మాటలను నమ్మి అలాగే చేశానన్నారు. ఆ తర్వాత సదరు కారును మరో ఎమిరేట్లోని షోరూమ్లో కారును అమ్మకానికి ఉంచినట్లు తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసును విచారించిన కోర్టు.. ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 761,920 దిర్హామ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







