మూడేళ్లలో 77 మంది పిల్లలు చనిపోయారు: OHRC
- December 26, 2022
మస్కట్: గత మూడేళ్లలో మానసిక వేధింపులు, పిల్లల పట్ల పేరెంట్స్ నిర్లక్ష్యం కారణంగా 77 మందికి పైగా పిల్లలు మరణించారని ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) వెల్లడించింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలో మహిళా వ్యవహారాలపై నిపుణురాలు, OHRCలో సమాచార కమిటీ అధిపతి లబీబా బింట్ మొహమ్మద్ అల్ మావ్లియా ఈ దురదృష్టకర సంఘటనలను ధృవీకరించారు. గత మూడు సంవత్సరాలలో ఎక్కువ మంది పిల్లలు, బస్సులు లేదా ప్రైవేట్ కార్లలో మరచిపోయి, లోయలు, ఈత కొలనులలో మునిగిపోవడం వల్ల మరణించారని పేర్కొన్నారు. పిల్లల మరణానికి కారణమైన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఒమానీ మహిళా సంఘం సహకారంతో కమిషన్ ఒమన్ అంతటా పిల్లల పట్ల నిర్లక్ష్యం, వేధింపులను తగ్గించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వారం ముసందం గవర్నరేట్లోని ఖాసబ్, బుఖా, దిబ్బ విలాయత్లలో కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







