ప్రసూతి విభాగంలో డాక్టర్ కావ్య ప్రియా వజ్రాలకు అవార్డు
- December 27, 2022
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన టైమ్స్ హెల్త్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని పార్క హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఆస్పత్రులు, మెడికల్ ఇన్ స్టిట్యూట్లు, క్లినికల్స్, డయోగ్నోస్టిక్ సెంటర్లు తదితర వైద్య రంగానికి చెందిన విభాగాల్లో విశేష సేవలు, కృషి చేసిన వైద్యులు, సంస్థలను ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు. ఈ సంవత్సరం వివిధ విభాగాల్లో మొత్తం 56 మంది వైద్యులకు అవార్డులు అందజేశారు.
తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సునిల్ శెట్టి, హ్యూమాఖురేషీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన వైద్యులకు వీరు అవార్డులను అందజేశారు.
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కావ్య ప్రియా వజ్రాల టైమ్స్ హెల్త్ కేర్ అవార్డ్స్ 2022 కు ఎంపికయ్యారు. కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ ఫెర్టిలిటీ స్పెషాలిస్ట్, కాస్మటిక్ గైనకాలజీ స్పెషాలిస్ట్ నిపుణురాలైన డాక్టర్ కావ్య ప్రియా వజ్రాలకు.. ఆయా రంగాల్లో అందించిన విశేష సేవలను పురస్కరించుకొని ‘బెస్ట్ ఎమర్జింగ్ ప్రసూతి & గైనకాలజిస్ట్’ విభాగంలో అవార్డును అందజేశారు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







