బంగారు హారాన్ని దొంగిలించిన పనిమనిషికి జైలు, జరిమానా
- December 27, 2022
దుబాయ్: యజమాని ఇంట్లో బంగారు హారాన్ని దొంగిలించిన మహిళకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వృద్ధ మహిళ, పిల్లల సంరక్షణ కోసం పనిమనిషి కావాలని ఆన్లైన్ జాబ్ పోస్ట్ను చూసి జాయిన్ అయిన ఒక ఆసియా మహిళ.. అదును చూసి దొంగతనానికి పాల్పడిందని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష, 20,000 దిర్హామ్ జరిమానా విధించింది. శిక్ష అనంతరం ఆమెను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. పోలీసు రికార్డుల ప్రకారం.. గత జూన్లో ఈ కేసు నమోదైంది. దొంగతనం జరిగిన 14 రోజుల తర్వాత పనిమనిషి కనిపించకుండా పోయిందని ఇంటి యజమాని తెలిపారు. పనిమనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







