బంగారు హారాన్ని దొంగిలించిన పనిమనిషికి జైలు, జరిమానా
- December 27, 2022
దుబాయ్: యజమాని ఇంట్లో బంగారు హారాన్ని దొంగిలించిన మహిళకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వృద్ధ మహిళ, పిల్లల సంరక్షణ కోసం పనిమనిషి కావాలని ఆన్లైన్ జాబ్ పోస్ట్ను చూసి జాయిన్ అయిన ఒక ఆసియా మహిళ.. అదును చూసి దొంగతనానికి పాల్పడిందని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష, 20,000 దిర్హామ్ జరిమానా విధించింది. శిక్ష అనంతరం ఆమెను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. పోలీసు రికార్డుల ప్రకారం.. గత జూన్లో ఈ కేసు నమోదైంది. దొంగతనం జరిగిన 14 రోజుల తర్వాత పనిమనిషి కనిపించకుండా పోయిందని ఇంటి యజమాని తెలిపారు. పనిమనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







