ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ ద్వారా మహిళను మోసం చేసిన వ్యక్తికి భారీ జరిమానా

- December 27, 2022 , by Maagulf
ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ ద్వారా మహిళను మోసం చేసిన వ్యక్తికి భారీ జరిమానా

యూఏఈ: అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఒక మహిళను 250,000 దిర్హామ్‌లు మోసం చేసిన ఒక వ్యక్తికి 300,000 దిర్హామ్‌లు చెల్లించాలని ఆదేశించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిందితుడిని కలిశానని ఫిర్యాదుదారురు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అతను అనేక వాణిజ్య వ్యాపారాలతో ఎమిరాటి అని చెప్పుకున్నాడని ఆమె చెప్పింది. 250,000 దిర్హామ్‌లు ఇచ్చి ఓ బిజినెస్ లో భాగస్వామి కావాలని తమను కోరాడాని, దాంతో డబ్బును అప్పుగా తీసుకుని అతనికి బదిలీ చేసినట్లు బాధితురాలు తన పిటిషన్ లో తెలిపింది. అనరంతం తాను మోసానికి గురయ్యానని, నిందితుడు ఎమిరాటీ కాదని గ్రహించి అతనిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు పేర్కొంది. కేసును విచారించిన కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. ఆమెకు మోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని, దాంతోపాటు జరిగిన నష్టానికి పరిహారంగా Dh50,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com