జనవరిలో ఇండియాలో స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్:సౌదీ
- December 29, 2022
రియాద్: ఈ నెలాఖరులో ఇండియాలో నైపుణ్య ధృవీకరణ కార్యక్రమం (SVP) మొదటి దశను ప్రారంభించనున్నట్లు సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రకటించింది. ఇండియా రాజధాని న్యూఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో పైలట్ దశను ప్రారంభించనున్నది. మొదటి దశలో నైపుణ్య పరీక్ష కోసం ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, రిఫ్రిజిరేషన్/ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఎలక్ట్రీషియన్ వంటి ఐదు వృత్తులను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం కింద భారతీయ కార్మికులు సౌదీ వర్క్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు నైపుణ్యం కలిగిన కార్మికుల రాత, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. SVP సౌదీ ఉపాధి మార్కెట్లో నైపుణ్యం కలిగిన కార్మికుల వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే వారి ఉత్పాదకతను మెరుగుపరచడానికి, వారు అందించే వృత్తిపరమైన సేవల నాణ్యతను మెరుగుపరచడానికి MHRSD ప్రయత్నాలకు కొనసాగింపుగా ప్రవేశపెట్టింది. సౌదీ లేబర్ మార్కెట్లో నైపుణ్యం కలిగిన కార్మికుల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి SVPని మార్చి 2021లో ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..







