ఏపీలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్
- December 29, 2022
అమరావతి: సూళ్లూరుపేటలో భారీ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచేసింది. సుమారు 12 కోట్లకు టోకరా వేసిన మహిళ.. కనిపించకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
సూళ్లూరుపేట రైల్వే గేట్ రోడ్ లో నివసిస్తున్న పద్మావతి శెట్టి అనే మహిళ దుస్తుల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తూ అందరి అభిమానం సంపాదించింది.ఈ పరిచయాలు ఉపయోగించుకుని కొన్నేళ్ల నుంచి చిట్టీలు వేయడం మొదలుపెట్టింది. మొదట్లో బాగానే సాగిన లావాదేవీలతో ఆమె వద్ద చిట్టీలు వేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. కొన్ని రోజుల నుంచి చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న పద్మావతి శెట్టి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.
ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమె డబ్బుతో పరార్ అయ్యిందని తెలుసుకుని పద్మావతి ఇంట్లో ఉన్న దుస్తులను మూట కట్టి పట్టుకుని పోయారు కొందరు బాధితులు. ఎంతో కొంత దక్కించుకున్నామనే ఆశతో మరికొందరు బాధితులు ఆటోల్లో వచ్చి దుస్తుల మూటలను పట్టుకెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







