ఏపీలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్
- December 29, 2022
అమరావతి: సూళ్లూరుపేటలో భారీ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచేసింది. సుమారు 12 కోట్లకు టోకరా వేసిన మహిళ.. కనిపించకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
సూళ్లూరుపేట రైల్వే గేట్ రోడ్ లో నివసిస్తున్న పద్మావతి శెట్టి అనే మహిళ దుస్తుల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తూ అందరి అభిమానం సంపాదించింది.ఈ పరిచయాలు ఉపయోగించుకుని కొన్నేళ్ల నుంచి చిట్టీలు వేయడం మొదలుపెట్టింది. మొదట్లో బాగానే సాగిన లావాదేవీలతో ఆమె వద్ద చిట్టీలు వేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. కొన్ని రోజుల నుంచి చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న పద్మావతి శెట్టి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.
ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమె డబ్బుతో పరార్ అయ్యిందని తెలుసుకుని పద్మావతి ఇంట్లో ఉన్న దుస్తులను మూట కట్టి పట్టుకుని పోయారు కొందరు బాధితులు. ఎంతో కొంత దక్కించుకున్నామనే ఆశతో మరికొందరు బాధితులు ఆటోల్లో వచ్చి దుస్తుల మూటలను పట్టుకెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







