దుబాయ లో కొత్త అగ్నిమాపక భద్రత చర్యలలో ఆక్సిజన్ కనెక్షన్
- April 28, 2016
విద్యుత్, నీటి కనెక్షన్ మాదిరిగానే ఆక్సిజన్ ను ఇక అగ్ని మాపక దళం ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. అగ్ని చుట్టిముట్టినపుడు అగ్నిమాపకదళ సిబ్బంది ఈ ఆక్సిజన్ వ్యవస్థనుసమర్ధవంతంగాఉపయోగించుకొంటారు. ఆకాశహర్మ్యాలలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏర్పడిన ఒక పౌర రక్షణ సమితి ఎమిరేట్ లో ఉన్న భవనాలలో అగ్నిభద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.అంతేకాక ఒక పటిష్టమైన ఆధునాతన అలారం వ్యవస్థ మరియు ప్రతి భవనం కోసం ఆక్సిజన్ కనెక్షన్ తీసుకోవాలని ప్రధాన సిఫార్సులు చేశారు .దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ రషీద్ థానీ అల్ మత్రౌషి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం ఏర్పాటయిన ప్రామాణిక కమిటీ దుబాయ్ కొత్త భవనాల ప్రత్యేకతలు మార్పులు చేయడానికి క్రొత్త సిఫార్సు జారీ చేసినట్లు చెప్పారు.ఈ బృందం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తాపడం కోసం ఉపయోగించిన పదార్థం అగ్నివ్యాప్తిని నిరోధించడానికి మరియు మంటలను అదుపులోనికి తేవటానికి నుండి ఒక సమగ్ర పరిష్కారం సూచించారు.ఈ సిఫార్సులను 6 వ వార్షిక అగ్నిభద్రత సాంకేతిక ఫోరంను ఉప ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి. లెఫ్టినెంట్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆవిష్కరించారు. అల్ మత్రౌషి పేర్కొంటూ యుఎఇ లో ఉన్న భవనాలు సంఖ్య పరిగణనలోకి తీసుకొంటే, ఇక్కడ జరిగే అగ్ని సంఘటనలు అత్యల్పమని ఆయన అన్నారు.ప్యానెల్ సిఫారసులలో స్మార్ట్ అలారం వ్యవస్థ అమలు ప్రారంభమౌతుంది, దుబాయ్ సివిల్ డిఫెన్స్, దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ విద్యుచ్ఛక్తి మరియు వాటర్ అథారిటీ మరియు దుబాయ్ పోలీస్ మరియు అంబులెన్స్ ఈ విభాగాలు రాబోయే సమావేశాలలో భాగంగా ఉంటుందని తెలిపారు. అల్ మత్రౌషి మాట్లాడుతూ సివిల్ డిఫెన్స్ ఇప్పటికే షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రోగ్రాం అధీనంలోని నిర్మించుకున్న ఇళ్లలో ఉపయోగించే ఈ పరికరం కోసం1,950 దినార్ల ఖర్చవుతుందని నెలకు 40 దినార్ల నిర్వాహణ బిల్లు వస్తుందని ఇప్పటివరకు 220 భవనాలపై ఈ పరికరం అమర్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









