అజ్మాన్ లో బస్సు ఛార్జీలపై 30% తగ్గింపు
- January 04, 2023
యూఏఈ: మస్సార్ కార్డ్లను కలిగి ఉన్న విద్యార్థులకు బస్సు ఛార్జీలలో 30 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ATA) ప్రకటించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. ప్రజా రవాణా సేవలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఎమిరేట్లోని బస్ ఫ్లీట్ ఇటీవల అప్డేట్ చేయబడిందని తెలిపింది.
మస్సర్ కార్డ్ కోసం అధికార అధికారిక వెబ్సైట్(www.ta.gov.ae)ను సందర్శించాలి. షేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ నుయిమి స్ట్రీట్లోని అజ్మాన్ సెంట్రల్ బస్ స్టేషన్ను సందర్శించాలి.
ఆన్లైన్లో దరఖాస్తు
అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మస్సర్ కార్డ్ అభ్యర్థనను ఎంచుకోవాలి. ఎమిరేట్స్ ID వివరాలను నమోదు చేసి, దరఖాస్తు ఫారమ్కు క్లిక్ చేయాలి. వివరాలను పూర్తి చేసి, ఆపై పత్రాలను అప్లోడ్ చేయాలి. అనంతరం ఎమిరేట్స్ ID, ఇటీవలి ఫోటో కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ నమోదిత ఇమెయిల్ IDకి నిర్ధారణ మెయిల్ పంపబడుతుంది. కన్ఫర్మేషన్ మెయిల్ ప్రింటౌట్ తీసుకుని, అజ్మాన్ సెంట్రల్ బస్ స్టేషన్నికి వెళ్లి మస్సర్ కార్డ్ని తీసుకోవాలి.
మస్సర్ కార్డ్ ధర
మస్సర్ కార్డ్ ధర Dh 25. కార్డ్ బ్యాలెన్స్ Dh20 తో అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







