మానసిక ప్రవాస రోగుల ఇఖామాల పునరుద్ధరణ లేనట్టే!
- January 04, 2023
కువైట్: మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాస రోగుల రెసిడెన్సీని పునరుద్ధరణపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సమీక్ష నిర్వహించనున్నది. వారి రెసిడెన్సీని పొడిగించవద్దని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసుల పేర్లతో ఇప్పటికే జాబితా రూపొందించింది. వారి అనారోగ్యం తీవ్రతను బట్టి వారిని వర్గీకరించింది. దీర్ఘకాలిక మానసిక అనారోగ్యాలు ఉన్నవారు, చిన్న సమస్యలకు చికిత్స పొందుతున్నవారితో జాబితాను రూపొందించినట్లు సమాచారం. నివేదిక ప్రకారం, దేశంలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో దాదాపు 9,272 మంది ప్రవాసులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







