మానసిక ప్రవాస రోగుల ఇఖామాల పునరుద్ధరణ లేనట్టే!
- January 04, 2023
కువైట్: మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాస రోగుల రెసిడెన్సీని పునరుద్ధరణపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సమీక్ష నిర్వహించనున్నది. వారి రెసిడెన్సీని పొడిగించవద్దని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసుల పేర్లతో ఇప్పటికే జాబితా రూపొందించింది. వారి అనారోగ్యం తీవ్రతను బట్టి వారిని వర్గీకరించింది. దీర్ఘకాలిక మానసిక అనారోగ్యాలు ఉన్నవారు, చిన్న సమస్యలకు చికిత్స పొందుతున్నవారితో జాబితాను రూపొందించినట్లు సమాచారం. నివేదిక ప్రకారం, దేశంలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో దాదాపు 9,272 మంది ప్రవాసులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







