మానసిక ప్రవాస రోగుల ఇఖామాల పునరుద్ధరణ లేనట్టే!
- January 04, 2023
కువైట్: మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాస రోగుల రెసిడెన్సీని పునరుద్ధరణపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సమీక్ష నిర్వహించనున్నది. వారి రెసిడెన్సీని పొడిగించవద్దని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసుల పేర్లతో ఇప్పటికే జాబితా రూపొందించింది. వారి అనారోగ్యం తీవ్రతను బట్టి వారిని వర్గీకరించింది. దీర్ఘకాలిక మానసిక అనారోగ్యాలు ఉన్నవారు, చిన్న సమస్యలకు చికిత్స పొందుతున్నవారితో జాబితాను రూపొందించినట్లు సమాచారం. నివేదిక ప్రకారం, దేశంలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో దాదాపు 9,272 మంది ప్రవాసులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









