మానసిక ప్రవాస రోగుల ఇఖామాల పునరుద్ధరణ లేనట్టే!
- January 04, 2023
కువైట్: మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాస రోగుల రెసిడెన్సీని పునరుద్ధరణపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సమీక్ష నిర్వహించనున్నది. వారి రెసిడెన్సీని పొడిగించవద్దని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవాసుల పేర్లతో ఇప్పటికే జాబితా రూపొందించింది. వారి అనారోగ్యం తీవ్రతను బట్టి వారిని వర్గీకరించింది. దీర్ఘకాలిక మానసిక అనారోగ్యాలు ఉన్నవారు, చిన్న సమస్యలకు చికిత్స పొందుతున్నవారితో జాబితాను రూపొందించినట్లు సమాచారం. నివేదిక ప్రకారం, దేశంలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రులలో దాదాపు 9,272 మంది ప్రవాసులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









