కారు బాంబు పేలుడులో తొమ్మిది మంది మృతి
- January 04, 2023
మోగాదిషు: సెంట్రల్ సోమాలియాలోని మహాస్ పట్టణ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుడు పదార్థాలు నింపిన వాహనాలతో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటంతో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
స్థానిక భద్రతా అధికారి అబ్దుల్లాహి అదాన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడ్డారని అన్నారు. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మరణించినట్లు గుర్తించామని అన్నారు.ఈ దాడికి ఉగ్రవాద సంస్థ అల్–షబాబ్కు చెందిన జిహాదీ యోధులుగా తెలుస్తోంది.
మహస్ లోని జిల్లా పరిపాలనా భవనానికి సమీపంలో ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు మహాస్ లోని పోలీస్ కమాండర్ ఉస్మాన్ నూర్ అన్నారు.ఈ దాడిలో మృతులంతా అమాయక పౌరులేనని తెలిపారు. ఉగ్రవాదులు పౌరులను భయపెట్టడానికి పేలుళ్లకు పాల్పడ్డారని, అయితే ఇలాంటి ఘటనలతో ప్రజలను బయపెట్టలేరని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









