తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- January 04, 2023
న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.
తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులతోపాటు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.దీంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇతర జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.
కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.ప్రాజెక్టుల పురోగతి పై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







