సౌదీలో వారంలో 14,740 మంది అక్రమార్కులు అరెస్ట్
- January 08, 2023
రియాద్: గత వారం రోజుల్లో రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 14,740 మందిని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 29, 2022 నుండి జనవరి 4, 2023 వరకు వారంలో రాజ్యమంతటా భద్రతా బలగాలు నిర్వహించిన ఉమ్మడి క్షేత్ర తనిఖీల సందర్భంగా అరెస్టులు జరిగాయన్నారు.
అరెస్టులలో రెసిడెన్సీ వ్యవస్థను ఉల్లంఘించిన 8,058 మంది, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 4,283 మంది, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 2,399 మంది ఉన్నారు. రాజ్యంలోకి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ మరో 832 మంది అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో 53% మంది యెమెన్లు, 44% ఇథియోపియన్లు, 3% ఇతర జాతీయులు ఉన్నారు. నిందితులకు సహకరించిన 15 మంది వ్యక్తులను కూడా అధికారులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం 34,103 మందిపై ఈ తరహా కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 32,468 మంది పురుషులు, 1,635 మంది మహిళలు ఉన్నారు. 24,440 మందిని ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యకలాపాలకు సిఫార్సు చేశామని, 2,600 మంది ఉల్లంఘించిన వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి రిఫర్ చేయగా.. 11,762 మంది ఉల్లంఘించిన వారిని బహిష్కరించారు. ఈ తరహా కేసుల్లో నిందితులకు సహకారం అందించిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం









