సిరియాలో వైమానిక దాడులు, 27 మంది మృతి
- April 28, 2016
సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో 27మంది మృతిచెందారు. నగరంలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో సిరియాలో తరచుగా వైమానిక దాడులు చేపడుతుంటారు.
ఆసుపత్రిలో తిరుగుబాటు దారులు ఉన్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ దాడులు జరిపింది. ఇందులో ఇప్పటికే 27 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
గత కొన్ని రోజుల్లో అలెప్పోలో వైమానిక దాడులు ఎక్కువవుతున్నాయి. ఆరురోజుల్లో జరిగిన దాడుల్లో 148 మంది పౌరులు మృతిచెందినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







