సిరియాలో వైమానిక దాడులు, 27 మంది మృతి

- April 28, 2016 , by Maagulf
సిరియాలో వైమానిక దాడులు, 27 మంది మృతి

సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో 27మంది మృతిచెందారు. నగరంలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో సిరియాలో తరచుగా వైమానిక దాడులు చేపడుతుంటారు.
ఆసుపత్రిలో తిరుగుబాటు దారులు ఉన్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ దాడులు జరిపింది. ఇందులో ఇప్పటికే 27 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
గత కొన్ని రోజుల్లో అలెప్పోలో వైమానిక దాడులు ఎక్కువవుతున్నాయి. ఆరురోజుల్లో జరిగిన దాడుల్లో 148 మంది పౌరులు మృతిచెందినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com