ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత్పై పోరుకే
- April 28, 2016
ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్కు విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా చట్టసభ అగ్ర సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ యుద్ధ విమనాలను ఉగ్రవాదంపై పోరుకు కాకుండా భారత్కు వ్యతిరేకంగా వినియోగించవచ్చన్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల సంఘంలోని ఆసికా, పసిఫిక్ వ్యవహారాల ఉసంఘం ఆధ్వర్యంలో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్పై బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తనతో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు ఈ యుద్ధవిమానాలను విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రశ్నించారని కాంగ్రెస్ సభ్యుడు మాట్ సాల్మన్ చెప్పారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు ఎఫ్-16 విమానాలు పాకిస్థాన్కు సరైనవేనా, తక్కువ వ్యయంతో కూడుకున్నవేనా, భారత్-పాకిస్థాన్ మధ్య అధికార సంతులనానికి పెద్దగా అవరోధం కలిగించని ఆయుధ వ్యవస్థా కాదా అన్న విషయాన్ని మనం పరిశీలించాలి అని మరో సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు మాత్రమే యుద్ధ వ్యవస్థలను తయారు చేసి ఇవ్వాలి తప్ప భారత్తో యుద్ధం కోసం పనికొచ్చే విమానాలను కాదని ఆయన అన్నారు. ఈ విమానాలను విక్రయించడం వెనక ఉన్న అసలు ఉద్దేశమేమిటి? విక్రయించాలనుకుంటున్న సమయం సరైనదేనా? ఈ నిర్ణయం అమెరికాకు ఎలా ప్రయోజనం కలిగిస్తుంది? అన్న అంశాలపై వివరణ ఇవ్వాలని ఒబామా ప్రభుత్వానికి ఈ ఉపసంఘంలో ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్ ఓల్సన్ను సాల్మన్ కోరారు. 2009లో అఫ్గానిస్థాన్లో అమెరికన్లపై జరిగిన దాడిలో పాకిస్థానీ తాలిబన్ల ప్రమేయముందని, ఆ ఉగ్రవాదులపై కచ్చితమైన దాడిని చేసే సామర్థ్యాన్ని పాకిస్థాన్ వృద్ధి చేసుకుందని, ఆ వ్యవస్థను ఎఫ్-16లో వాడుతుందని ఓల్సన్.. ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









