అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్..ప్రసాదం విక్రయాలు బంద్..
- January 12, 2023
త్రివేండ్రం: అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి కోట్లాది మంది భక్తులు శబరిమల వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని తీసుకుని తిరుగుపయనం అవుతారు. కానీ, ఇప్పుడు అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాద విక్రయాలను బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయం కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది.
నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దాంతో ట్రావెన్కోర్ ట్రస్ట్.. ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే, యాలకులు లేకుండా ప్రసాదాల తయారీకి అనుమంచింది హైకోర్టు. కాగా, కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలతో దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిచిపోయింది.
కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రసాదాల తయారీకి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మరోవైపు ప్రసాదం విక్రయాలు నిలిచిపోవడంతో భక్తులు ఉసూరుమంటున్నారు. అయ్యప్ప ప్రసాదం దొరక్కపోవడంతో కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







