బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీస్
- January 12, 2023
బెంగళూరు: బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం, హోసూరు ఏరోడ్రోమ్ ను కలుపుతూ ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్లై బ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థలు జాయింట్ వెంచర్ గా ఈ సేవలను ప్రారంభించాయి.హెలికాప్టర్ సర్వీసుల కోసం ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు.
హోసూరు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గంలో చేరుకునేందుకు 3 గంటల సమయం పడుతుంది. హెలికాప్టర్ ద్వారా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బుధవారం నుంచి బ్లేడ్ ఇండియా వెబ్ సైట్ లో హెలికాప్టర్ సర్వీసుల బుకింగ్స్ ప్రారంభించారు. 2019లో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించిన బ్లేడ్ ఇండియా.. మహారాష్ట్రలోని ముంబై, పూణె, షిర్డీల మధ్య సేవలు అందిస్తోంది.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









