ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో సోమేశ్ కుమార్ భేటీ
- January 12, 2023అమరావతి: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్ కుమార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కారుకి సోమేశ్ కుమార్ ఈ విషయంపై రిపోర్టు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.
అనంతరం ఆయన వీఆర్ఎస్ తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇవాళ జవహర్ రెడ్డిని కలిసిన సోమేశ్ కుమార్ అనంతరం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఏపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జాయినింగ్ రిపోర్టు అందించిన తర్వాత సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకోవడానికి అవకాశం ఉంది.
సర్వీసుకి ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ కు ఆసక్తి లేదని తెలుస్తోంది. కాగా, తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారిని నియమిస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీనియార్టీ, సర్వీసు ఆధారంగా ఆమె నియామకం జరిగింది. తెలంగాణ కేడర్ లో సోమేశ్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకు నేడు చివరి రోజు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!