ఫోన్ కుంభకోణంలో 21 మంది అనుమానితులను షార్జాలో అరెస్టు
- April 28, 2016
షార్జ: మీ టెలిఫోన్ నెంబర్ విలువైన బహుమతులను గెలుపొందిందని బురిడీ కొట్టించే మోసగాళ్ళకు షార్జా పోలీసులు చెక్ పెట్టారు. డబ్బు బదిలీ కావాలంటే మీ బ్యాంకు ఖాతా వివరాలు తెలియచేయాలని అందుకు ప్రతిఫలంగా మొబైల్ ఫోన్లకు రీచార్జ్ డబ్బుని పంపుతామనే 21 మంది సభ్యులుగల ఒక కుంభకొణ బృందాన్ని గురువారం అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయత అనుమానితులు , ఒక ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (ఎటిసలాట్) నుండి ఫోన్ కాల్ చేస్తూ మీ టెలిఫోన్ నెంబర్ కు 200,000 దినార్ల తో పాటు ఐఫోన్ 6 ఫోన్ బహుమతి లభించిందని వాటిని మీరు సాధించడం కోసం వెంటనే డబ్బు బదిలీ చేయాలని వారు తీవ్ర ఒత్తిడి తిసుకోస్తున్నారని నమ్మకమైన బాధితులు చెప్పారు. ఆ బహుమతి అందుకునే ముందు కొన్ని విధానాలు పూర్తి చేయాలని అందుకు మీరు 5,000 దినార్ల మరియు10,000 దినార్ల మధ్య మొత్తాన్ని తమకు బదిలీ చేయాలని తర్వాత ఆ మొత్తాలను బహుమతిగా అందుకోగలరని వారు పేర్కొంటున్నారని బాధితులు ఆరోపించారు. షార్జా నేర పరిశోధక విభాగం పోలీసులు అక్రమ కార్యకలాపాలు గురించి ఒక చిట్కాని ఉపయోగించేముందు ఒక జట్టుని ఏర్పాటు చేశారు.మోసకరమైన బహుమతుల ప్రకటన ద్వారా అమాయక ప్రజలు ఎవరైనా తమ ఎరకు చిక్కితే, వారి వద్ద నుంచి డబ్బు పుచ్చుకున్న తరువాత అనుమానితులను పోలిసుల నిఘాకి దొరకకుండా వారి సిమ్ కార్డ్ మార్చేసి ఈ బృందం అదృశ్యం అవుతారు. ఆ ముఠా సభ్యుల జాడ తెల్సుకోనేందుకు పోలీసులు ఒక బాధితుడు ద్వారా ఫోన్ చేయించి ఆ బృందాన్ని అల్ ణహ్ద లోని రెండు అపార్టుమెంట్లపై పోలీసులు దాడి చేశారు. అక్కడ మొబైల్ ఫోన్లను మరియు పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొన్నారు. అనుమానితులు తమ నేరాలను ఒప్పుకున్నారు మరియు ప్రజా విచారణకు వారిని పంపించారు .క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ డిప్యూటీ చీఫ్ లేఫ్టినెంట్ కల్నల్ ఫైసల్ బిన్ నాసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఏదైనా అనుమానాస్పద చర్యలు లేదా నేరాలకు పాల్పడే వారి గురించి సమాచారాన్ని తెలియచేసి భద్రతా సంస్థలకు సహకరించాలని కోరారు. మరియు 999 లేదా 06-5632222 లేదా టోల్ ఫ్రీ నెంబర్ నజీద్ 800 151 లేదా ఎస్ .ఎం. ఎస్ ద్వారా తెలియచేయాలని కోరారు అలాగే 7999 లేదా www.shjpolice.gov.ae/najeed కు ఈ మెయిల్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్