మస్కట్ బస్సు ప్రమాదంలో 22 మందికి గాయాలు
- January 17, 2023
మస్కట్: సీబ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ మేరకు CDAA ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు 25 మంది ప్రయాణికులతో కూడిన బస్సు విలాయత్ ఆఫ్ సీబ్లో ప్రమాదానికి గురైందని పేర్కొంది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయని తెలిపింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించామని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









