మస్కట్ బస్సు ప్రమాదంలో 22 మందికి గాయాలు
- January 17, 2023
మస్కట్: సీబ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ మేరకు CDAA ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు 25 మంది ప్రయాణికులతో కూడిన బస్సు విలాయత్ ఆఫ్ సీబ్లో ప్రమాదానికి గురైందని పేర్కొంది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయని తెలిపింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించామని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







