అబుధాబికి చేరుకున్న ఒమాన్ సుల్తాన్
- January 18, 2023
అబుధాబి: ఒమాన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో సుల్తాన్కు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెన్షియల్ కోర్ట్లోని ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ కూడా ఒమాన్ సుల్తాన్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అబుధాబిలో జరగనున్న జీసీసీ రాష్ట్రాలు, జోర్డాన్, ఈజిప్ట్ నాయకుల మధ్య జరిగే సమావేశంలో సుల్తాన్ పాల్గొంటారు. అనంతరం యూఏఈలో ఒమాన్ సుల్తాన్ పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









