ఫర్వానియా ప్రాంతంలో 18 విద్యుత్ ఉల్లంఘనలు
- January 19, 2023
కువైట్: విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ బృందం ఫర్వానియాలో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీకి చెందిన కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో "బ్యాచిలర్స్" నివసించే ప్రాంతాల్లో విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగ వ్యవస్థలను తనిఖీ చేశారు. టీమ్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్-షమ్మరీ మాట్లాడుతూ.. తమ తనిఖీలు కొనసాగుతాయన్నారు. విద్యుత్, నీటి దుర్వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. జనవరిలో మొత్తం 18 విద్యుత్, నీటి ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









