ఫర్వానియా ప్రాంతంలో 18 విద్యుత్ ఉల్లంఘనలు
- January 19, 2023
కువైట్: విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ బృందం ఫర్వానియాలో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీకి చెందిన కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో "బ్యాచిలర్స్" నివసించే ప్రాంతాల్లో విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగ వ్యవస్థలను తనిఖీ చేశారు. టీమ్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్-షమ్మరీ మాట్లాడుతూ.. తమ తనిఖీలు కొనసాగుతాయన్నారు. విద్యుత్, నీటి దుర్వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. జనవరిలో మొత్తం 18 విద్యుత్, నీటి ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!









