ఫర్వానియా ప్రాంతంలో 18 విద్యుత్ ఉల్లంఘనలు
- January 19, 2023
కువైట్: విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ బృందం ఫర్వానియాలో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీకి చెందిన కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో "బ్యాచిలర్స్" నివసించే ప్రాంతాల్లో విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగ వ్యవస్థలను తనిఖీ చేశారు. టీమ్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ అల్-షమ్మరీ మాట్లాడుతూ.. తమ తనిఖీలు కొనసాగుతాయన్నారు. విద్యుత్, నీటి దుర్వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. జనవరిలో మొత్తం 18 విద్యుత్, నీటి ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







