చలికాలంలో చర్మం పొడిబారుతోందా.?
- January 20, 2023శీతాకాలం వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా వుంటుంది. అందుకే, చర్మం పొడిబారిపోతుంది. చలి గిలి ఎక్కువగా వున్న కారణంగా ఎక్కువగా నీరు త్రాగాలని అనిపించదు. తద్వారా శరీరంలో నీటి శాతం తక్కువయిపోయి డీ హైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయ్.
ఊరికే నీరసం రావడం, కండరాల నొప్పులు, రక్తపోటు, చికాకు, తలనొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి. దాహం వేయకపోయినా, తగినంత నీరు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో రోగ నిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా వుంటుంది. అందుకే, రకరకాల ఫ్లూ సంబంధిత వ్యాధుల బారిన సులువుగా పడుతుంటాం. చలికాలంలో నీరు తాగడం కష్టమే అయినప్పటికీ ఖచ్చితంగా తాగాల్సిన ఆవశ్యకత వుంది. కాబట్టి. అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయ్. అవేంటో తెలుసుకుందాం.
ఓ గ్లాసు వాటర్లో కొద్దిగా నిమ్మరసం.. అదేనండీ నిమ్మకాయ నీళ్లు తాగి చూడండి.
వివిధ రకాల పండ్ల రసాలను చిక్కగా కాకుండా కాస్తంత నీరు జోడించి గడ గడా తాగేయండి.
చలికాలంలో చెమట ఎక్కువగా పట్టని కారణంగా శరీరంలో ఉప్పు నిల్వలు ఎక్కువయిపోతాయ్. ఉప్పు శాతం పెరిగితే అధిక రక్తపోటు సమస్యలొస్తాయ్. అందుకే వీలైనంత తక్కువ ఉప్పు తీసుకోవాలి.
నీటి శాతం అధికంగా వుండే, పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా వుండే కాఫీలూ, టీలూ తగ్గించాలి.హెర్బల్ టీలకు ప్రాధాన్యమిస్తే మంచిది. అలాగే, శరీరాన్ని వెచ్చగా వుంచేందుకు వేడి వేడి ద్రవాలు తీసుకోవడం కూడా ఉత్తమం.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ