చలికాలంలో చర్మం పొడిబారుతోందా.?
- January 20, 2023
శీతాకాలం వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా వుంటుంది. అందుకే, చర్మం పొడిబారిపోతుంది. చలి గిలి ఎక్కువగా వున్న కారణంగా ఎక్కువగా నీరు త్రాగాలని అనిపించదు. తద్వారా శరీరంలో నీటి శాతం తక్కువయిపోయి డీ హైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయ్.
ఊరికే నీరసం రావడం, కండరాల నొప్పులు, రక్తపోటు, చికాకు, తలనొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి. దాహం వేయకపోయినా, తగినంత నీరు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో రోగ నిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా వుంటుంది. అందుకే, రకరకాల ఫ్లూ సంబంధిత వ్యాధుల బారిన సులువుగా పడుతుంటాం. చలికాలంలో నీరు తాగడం కష్టమే అయినప్పటికీ ఖచ్చితంగా తాగాల్సిన ఆవశ్యకత వుంది. కాబట్టి. అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయ్. అవేంటో తెలుసుకుందాం.
ఓ గ్లాసు వాటర్లో కొద్దిగా నిమ్మరసం.. అదేనండీ నిమ్మకాయ నీళ్లు తాగి చూడండి.
వివిధ రకాల పండ్ల రసాలను చిక్కగా కాకుండా కాస్తంత నీరు జోడించి గడ గడా తాగేయండి.
చలికాలంలో చెమట ఎక్కువగా పట్టని కారణంగా శరీరంలో ఉప్పు నిల్వలు ఎక్కువయిపోతాయ్. ఉప్పు శాతం పెరిగితే అధిక రక్తపోటు సమస్యలొస్తాయ్. అందుకే వీలైనంత తక్కువ ఉప్పు తీసుకోవాలి.
నీటి శాతం అధికంగా వుండే, పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా వుండే కాఫీలూ, టీలూ తగ్గించాలి.హెర్బల్ టీలకు ప్రాధాన్యమిస్తే మంచిది. అలాగే, శరీరాన్ని వెచ్చగా వుంచేందుకు వేడి వేడి ద్రవాలు తీసుకోవడం కూడా ఉత్తమం.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







