దుబాయ్ ‘అల్ట్రా-లగ్జరీ అట్లాంటిస్’ను సందర్శించిన షేక్ మొహమ్మద్
- January 22, 2023
యూఏఈ: ఎమిరేట్లోని పామ్ జుమేరా ద్వీపంలోని కొత్త ఐకానిక్ ల్యాండ్మార్క్ ‘అల్ట్రా-లగ్జరీ అట్లాంటిస్’ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ సందర్శించారు. "మన పర్యాటక రంగానికి కొత్త ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్- అట్లాంటిస్ ది రాయల్ హోటల్" అని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 10 సంవత్సరాలలో దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో ప్రైవేట్ రంగం కీలక భాగస్వామిగా కొనసాగుతుందన్నారు. "యూఏఈ, దుబాయ్ అంతర్జాతీయ పర్యాటకులకు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానంగా మారేందుకు ప్రైవేట్ రంగంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము." అని షేక్ మహమ్మద్ అన్నారు.
ప్రపంచంలోని ప్రముఖ డిజైనర్లు, ఆర్కిటెక్ట్లు, కళాకారులచే రూపొందించబడిన అట్లాంటిస్ ది రాయల్ 500 మీటర్ల పొడవు, 178 మీటర్ల పొడవైన మెగా నిర్మాణం. ఈ రిసార్ట్లో 90x33-మీటర్ల స్కై బ్రిడ్జ్లతో అనుసంధానించబడిన ఆరు టవర్లు ఉన్నాయి. ఇందులో 795 గదులు, సూట్లు, పెంట్హౌస్లు ఉన్నాయి. రిసార్ట్లో ప్రత్యేకమైన స్కై గార్డెన్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







