ఓటీటీలో ‘ధమాకా’ పరువు పోతోందిగా.!
- January 23, 2023ఇయర్ ఎండింగ్ గిఫ్ట్గా వచ్చిన మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ సూపర్ డూపర్ హిట్టు కొట్టి, సంవత్సరాంతంలో టాలీవుడ్ బాక్సాఫీస్కి సక్సెస్ గిఫ్ట్ ఇచ్చింది.
‘ధమాకా’తో రవితేజ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘వాల్తేర్ వీరయ్య’ హిట్తో డబుల్ ధమాకా అనిపించుకున్నాడు.
అంతా బాగానే వుంది. కానీ, రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ‘ధమాకా’ చూసిన వారంతా పెదవి విరిచేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు రెండూ మిక్సీలో వేసి వదిలిపెట్టారంటూ తిట్టి పోస్తున్నారు.
మరీ సీన్ టూ సీన్, సాంగ్ టు సాంగ్ అంతలా ఎలా కాపీ కొట్టేశావయ్యా మాస్ రాజా.! కాస్తయినా సిగ్గుండక్కర్లా.! అని దారుణంగా తిట్టేస్తున్నారు. దాంతో, హిట్ అనుకున్న ‘ధమాకా’ పరువు మొత్తం పోయినట్లవుతోందిప్పుడు.
ఇక తదుపరి మాస్ రాజా ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త