ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ..
- January 24, 2023న్యూ ఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తనపై ఫిర్యాదు చేయనందుకుగాను ఆ సంస్థకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో మరోసారి ఎయిర్ ఇండియా వివాదంలో చిక్కుకుంది.
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డీజీసీఏ జరిమానా విధించింది. గత డిసెంబర్ 6న ప్యారిస్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు నిబంధనలకు విరుద్ధంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విమానంలో పొగ తాగాడు. అలాగే మద్యం కూడా సేవించి ఉన్నాడు. విమానయాన సిబ్బంది చెప్పిన సూచనల్ని అతడు పట్టించుకోలేదు.
అలాగే ఒక సీటులో మహిళకు కేటాయించిన బ్లాంకెట్ను తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 5న విషయం వెలుగు చూడగా, దీనిపై డీజీసీఏ ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగి చాలా రోజులవుతున్నా బాధ్యుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఈ విషయాన్ని డీజీసీఏకు ఎందుకు నివేదించలేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని డీజీసీఏ పేర్కొంది. దీనికి ఎయిర్ ఇండియా సంస్థ సమాధానం ఇచ్చింది.ఈ సమాధానంపై డీజీసీఏ సంతృప్తి చెందలేదు. దీంతో ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల