530 మంది ప్రవాసుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించిన కువైట్
- January 28, 2023
కువైట్: 2022లో నకిలీ పాస్పోర్ట్తో తిరిగి కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న 530 మంది బహిష్కరణకు గురైన ప్రవాసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది. నివేదిక ప్రకారం నకిలీ పాస్పోర్ట్లు, తప్పుడు పేర్లను ఉపయోగించినా విమానాశ్రయంలో వేలిముద్ర పరికరాల ద్వారా వారిని గుర్తించినట్లు పేర్కొంది. వారిలో ఎక్కువ మంది ఆసియా దేశాల నుండి వచ్చినవారు ఉన్నారని, వారిలో 120 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 2011లో ఎయిర్పోర్ట్లో ఫింగర్ ప్రింటింగ్ పరికరాలను ఏర్పాటు చేసిన తర్వాత బహిష్కరణకు గురైన వేలాది మందిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు నివేదిక పేర్కొంది. కేవలం 3 సెకన్లలోనే వాంటెడ్ లిస్ట్, ట్రావెల్ బ్యాన్లో ఉన్న వారిని కూడా సిస్టమ్ గుర్తిస్తుందని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తన నివేదికలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







