530 మంది ప్రవాసుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించిన కువైట్
- January 28, 2023
కువైట్: 2022లో నకిలీ పాస్పోర్ట్తో తిరిగి కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న 530 మంది బహిష్కరణకు గురైన ప్రవాసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది. నివేదిక ప్రకారం నకిలీ పాస్పోర్ట్లు, తప్పుడు పేర్లను ఉపయోగించినా విమానాశ్రయంలో వేలిముద్ర పరికరాల ద్వారా వారిని గుర్తించినట్లు పేర్కొంది. వారిలో ఎక్కువ మంది ఆసియా దేశాల నుండి వచ్చినవారు ఉన్నారని, వారిలో 120 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 2011లో ఎయిర్పోర్ట్లో ఫింగర్ ప్రింటింగ్ పరికరాలను ఏర్పాటు చేసిన తర్వాత బహిష్కరణకు గురైన వేలాది మందిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు నివేదిక పేర్కొంది. కేవలం 3 సెకన్లలోనే వాంటెడ్ లిస్ట్, ట్రావెల్ బ్యాన్లో ఉన్న వారిని కూడా సిస్టమ్ గుర్తిస్తుందని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తన నివేదికలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







