530 మంది ప్రవాసుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించిన కువైట్
- January 28, 2023
కువైట్: 2022లో నకిలీ పాస్పోర్ట్తో తిరిగి కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న 530 మంది బహిష్కరణకు గురైన ప్రవాసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది. నివేదిక ప్రకారం నకిలీ పాస్పోర్ట్లు, తప్పుడు పేర్లను ఉపయోగించినా విమానాశ్రయంలో వేలిముద్ర పరికరాల ద్వారా వారిని గుర్తించినట్లు పేర్కొంది. వారిలో ఎక్కువ మంది ఆసియా దేశాల నుండి వచ్చినవారు ఉన్నారని, వారిలో 120 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 2011లో ఎయిర్పోర్ట్లో ఫింగర్ ప్రింటింగ్ పరికరాలను ఏర్పాటు చేసిన తర్వాత బహిష్కరణకు గురైన వేలాది మందిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు నివేదిక పేర్కొంది. కేవలం 3 సెకన్లలోనే వాంటెడ్ లిస్ట్, ట్రావెల్ బ్యాన్లో ఉన్న వారిని కూడా సిస్టమ్ గుర్తిస్తుందని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తన నివేదికలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







