రామ్ పోతినేని.! 100 మంది కాదు షేర్ఖాన్.. 300 మంది.!
- January 28, 2023యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్లాన్ మామూలుగా లేదండోయ్. ఎలాగైనా ఈ సారి గట్టి హిట్ కొట్టాలన్న కసితో వున్నాడీ యంగ్ హీరో. అందులో భాగంగానే మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేతులు కలిపాడు. ఇటీవలే ‘ది వారియర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన రామ్కి ఆశించిన సక్సెస్ అందలేదు.
దాంతో, మరింత కసి పెంచాడు. బోయపాటితో చేయబోయే సినిమా అలా ఇలా వుండదంట. మాస్ యాక్షన్కి పెట్టింది పేరైన బోయపాటి, రామ్తో చేయబోయే యాక్షన్ ప్యాన్ ఇండియా రేంజ్లో వుండబోతోంది. ‘మగధీర’లో 100 మందితో తీసిన ఫైట్ సంచలనం కాగా, ఇప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడే ఏకంగా 300 మందితో రామ్ పోతినేని మీద తెరకెక్కించబోతున్నాడట బోయపాటి.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లో రూపొందబోతోంది ఈ సినిమా. రామ్ కెరీర్లో మరో ఇస్మార్ట్ శంకర్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం