ఇరాన్ లో భారీ భూకంపం.. ఏడుగురి మృతి..
- January 29, 2023
టెహ్రాన్: ఇరాన్ లో భారీ భూకంపం సంభవించి, పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. ఏడుగురు మృతి చెందగా, మరో 440 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు చెప్పారు.
భూకంపంతో ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లో భవనాలు కూలిపోయాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక బృందాలు క్షతగాత్రులను కాపాడి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఆసుపత్రులకు సమాచారం అందించి, ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పామని ఇరాన్ అత్యవసర సేవల విభాగ అధికారులు మీడియాకు తెలిపారు.
భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితులు ఆర్తనాదాలు చేస్తుండడం కలచివేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పొగమంచు కూడా అధికంగా ఉందని, విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. గాయాలపాలైన వారికి ప్రథమ చికిత్స అందించి, అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అత్యవసర సేవా విభాగాలన్నింటినీ అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







