ఇరాన్ లో భారీ భూకంపం.. ఏడుగురి మృతి..
- January 29, 2023
టెహ్రాన్: ఇరాన్ లో భారీ భూకంపం సంభవించి, పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. ఏడుగురు మృతి చెందగా, మరో 440 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు చెప్పారు.
భూకంపంతో ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లో భవనాలు కూలిపోయాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక బృందాలు క్షతగాత్రులను కాపాడి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఆసుపత్రులకు సమాచారం అందించి, ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పామని ఇరాన్ అత్యవసర సేవల విభాగ అధికారులు మీడియాకు తెలిపారు.
భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితులు ఆర్తనాదాలు చేస్తుండడం కలచివేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పొగమంచు కూడా అధికంగా ఉందని, విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. గాయాలపాలైన వారికి ప్రథమ చికిత్స అందించి, అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అత్యవసర సేవా విభాగాలన్నింటినీ అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







